తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక నుండి ప్రతినిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మంగళవారం నాడు 110మంది రక్తనమూనాలు సేకరించి నిర్ధారణ నిమిత్తం బెజవాడ తరలించారు. ఇవి రావడానికి 3-4 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా ఇవి రావడానికి మరింత సమయం పడుతుందని అవగతమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధి చొరవ తీసుకుని తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వచ్చిన వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బుధవారం నాడు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో 43మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16మందికి పాజిటివ్గా వచ్చింది. స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఇరువురికి కూడా పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం.