తిరువూరు పట్టణంలోని వాహిణి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గంజాయి కల్గి ఉన్న 8 మంది వ్యక్తులను ఎస్సై సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని బృందం అదుపులోకి తీసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులు 20-22 వయస్సు కలిగినవారని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి గంజాయి తెప్పించి ఇక్కడ అక్రమంగా అమ్ముతున్నారని ఆయన వెల్లడించారు. వీరి నుండి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.