స్థానిక తిరువూరు శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న తేజస్వికి కీబోర్డ్ ప్రదర్శనలో ద్వితీయ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఇతర 100 తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ అంతర్జాతీయ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలలో భాగంగా నాదామృతం – కీబోర్డ్ విభాగంలో ప్రదర్శించగా గత రాత్రి విజేతలను ఆన్లైన్లో ప్రకటించారు. తేజస్వి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ, సాయంత్రం సమయంలో విద్యార్థులకు కీబోర్డ్ పై ఆన్లైన్ లో శిక్షణ కూడా ఇస్తుంటారు.