గంపలగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాజీ ఉప-ముఖ్యమంత్రి కోనేరు రంగారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ రాజమండ్రిలో మైనర్ బాలికపై అత్యాచారం, చీరాలలో దళిత యువకుడి హత్య, సీతానగరంలో దళిత యువకుడికి శిరోముండనం తదితర అంశాలపై నిరసన వ్యక్తపరిచారు. అనంతరం ఈ దిగువ తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
* రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ కమీషన్ను వెంటనే నియమించాలి.
* దళితులపై జరుగుతున్న దాడుల కేసులను CBCIDకి అప్పగించాలి.
* ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
* రాష్ట్రంలో ఎన్నో సేవలందించిన కోనేరు రంగారావు పేరు మీద స్మృతివనం, రాష్ట్రస్థాయిలో ఒక పథకానికి పేరు పెట్టాలి.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.