తిరువూరులో ఇప్పటివరకు నమోదు అయిన కరోనా కేసులపై స్పష్టతను ఇవ్వని అధికారులు తాజాగా మరోసారి స్థానికంగా కరోనా కలకలం రేపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం 10మందికి చేపట్టిన రాపిడ్ పరీక్షల్లో ఇరువురికి పాజిటివ్ ఫలితం రాగా వారి నమూనాలు విజయవాడకు ధృవీకరణ నిమిత్తం పంపినట్లు సమాచారం. ఈ కారణంగా స్థానిక అధికారులు ప్రకటనలు వెలువరించలేదు. ఈ కేసుల ధృవీకరణకు మరికొంచెం సమయం పట్టే సూచనలు ఉన్నాయి.