తిరువూరులో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
కృష్ణాజిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పట్టణంలో కరోనా వైరస్ కలకలంతో ప్రజలు భయభ్రాంతులకు గురవౌతున్నారని అన్నారు. స్థానిక వస్త్రవ్యాపారి మాతృమూర్తి కరోనాతో మృతిచెందగా 60మంది ఉద్యోగులకు చేసిన పరీక్షల్లో పొంతన లేని వివరాలు వెల్లడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 50000 జనాభా కలిగిన తిరువూరులో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 60మంది కరోనా పరీక్షా ఫలితాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.