తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన 59మంది కరోనా అనుమానితుల నిర్ధారణ పరీక్షల్లో ఈ రోజు ఉదయం రెండు పాజిటివ్ కేసులుగా నమోదు అయినట్లు సమాచారం. అధికారులు దీన్ని ధృవీకరించవల్సి ఉంది. మిగిలిన కేసులకు సంబంధించిన ఫలితాలు రేపు ఉదయం తెలుస్తాయని అధికారులు అంటున్నారు. ఈ రోజు పాజిటివ్గా నమోదు అయిన రెండు కేసుల్లో ఒకటి దుకాణం యజమానికి మరొకటి దుకాణంలో పనిచేసే గుమాస్తాకు కరోనా సోకినట్లు సమాచారం. పాజిటివ్ ఫలితం వచ్చిన ఇరువురు వ్యక్తులను మెరుగైన చికిత్స కోసం కోవిడ్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగి మూడురోజులు దాటుతున్నప్పటికీ పూర్తి ఫలితాలు వెల్లడి కాకపోవడంతో తిరువూరు ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం నాడు అయినా పూర్తి ఫలితాలతో కూడిన వివరాలు వెల్లడించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. మరొకపక్క తిరువూరులో లాక్డౌన్ను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. బోసుబొమ్మ సెంటరు నుండి రాజుపేట సెంటరు వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన సాయిబాబా గుడి బజారును అధికారులు పూర్తిగా మూసివేశారు. రాకపోకలను నిషేధించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.