తిరువూరు పట్టణంలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. స్థానిక సాయిబాబా ఆలయ రోడ్డులో ఓ మహిళకు పాజిటివ్గా తేలినట్లు తహశీల్దార్ స్వర్గం నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. వస్త్ర దుకాణ సిబ్బంది, ఈ రెండో కేసుకు సంబంధించిన వారందరికీ నేడు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ఆయన కోరారు. ఈ రెండు రోజులు ప్రజలు ప్రభుత్వాధికారులకు సహకరించవల్సిందిగా నరసింహరావు విజ్ఞప్తి చేశారు.