తిరువూరు నియోజకవర్గంలో మొదటి కరోనా పోసిటివ్ కేసు గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో నమోదైంది. ఓ ప్రభుత్వ ఉపాద్యాయుడు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలారు. భార్య వైద్య అవసరాల నిమిత్తం విజయవాడ పర్యటనకు వెళ్లిన ఆయన గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా స్థానిక RMP వైద్యుడు చేసిన చికిత్స ప్రభావం చూపకపోవడంతో నూజివీడులో జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించి మరింత సమాచారం సేకరిస్తున్నారు.