గత వారం రోజుల నుండి అంగరంగ వైభవంగా జరిగిన కృష్ణాజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి గురువారంతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి. చివరిరోజు స్వామివారికి పుష్పయాగము నిర్వహించగా రాత్రికి స్వామివారికి పవళింపు సేవతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఆరురోజుల పాటు ఆలయ ప్రాంగణంలో భక్తులను అలరించేందుకు రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.