*తిరువూరు పట్టణంలో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా సోమవారం జరుపుకున్నారు. ఉదయం 9 గంటలకంతా ముస్లిం సోదరులందరూ నూతన వస్త్రాలను ధరించి స్థానిక మల్లెమ్మ చెరువు వద్ద ఉన్న ఈద్గా దగ్గరకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.ఇస్లాం మతగురువు రిజ్వి (పేష్మామ్) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి.. అనంతరం పెద్దలు, పిల్లలు ఒకరిని ఒకరు ఆలింగనం పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్ళకు వెళ్ళి ఖుర్బానీ కార్యక్రమాన్ని కొనసాగించారు. హిందూ సోదరులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలను తెలిపారు. పట్టణంలో పండగ వాతావరణం కోలాహలంగా కనిపించింది.జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ హుస్సేన్,కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నమాజ్ ల కొరకు తగిన ఏర్పాట్లు చేశారు. గంపలగూడెం, విస్సన్నపేట, ఏ- కొండూరు మండలాల్లో ఆయా ఈద్గాహ్ లలో, మస్జీద్ లలో కూడా ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి..
*రెండుప్రమాదాలు ఇరువురికి తీవ్ర గాయాలు
ఏ-కొండూరు మండలం రామచంద్రపురం ద్ద బైక్ ను ఢీ కొన్న కార్..బైక్ పై ప్రయాణిస్తున్న గంపలగూడెం మండలం గొల్లపూడి కి చెందిన అరుణ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు..బైక్ ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి ప్రక్కన కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో తప్పిన పెను ప్రమాదం..కారులో మొత్తం నలుగురు ప్రయాణం..గాయలపాలైన వారిని మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు..
*వ్యక్తిని డీ కొట్టిన ‘వజ్ర’ బస్సు.
తిరువూరు మండలం లక్ష్మీపురం లో జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్ (వజ్ర)-TVS XL సూపర్ ఢీ-బండిపై ప్రయాణిస్తున్న కంటిపూడి నారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు..108 సహాయంతో తిరువూరు ప్రభుత్వాసుపత్రికికి తరలింపు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
*ఉచిత వైద్య శిభిరంలో పరీక్షలు
విస్సన్నపేట మండలం పుట్రెల పంచాయతీ కార్యాలయంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ఉచిత గుండె వ్యాధుల వైద్య శిభిరాన్ని నిర్వహించారు. దీనిలో విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు కోటేశ్వరరావు సేవలందించారు. సుమారు అరవై మందికి టూడీ , ఎకో పరీక్షలు చేసి మందులు అందజేశారు.
*నెమలిలో శాయనాదివాసం
శ్రావణమాసం సందర్భంగా గంపలగూడెం మండలంలోని నెమలి వేణుగోపాలస్వామీ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో రెండో ఆదివారం ఉదయం పవిత్ర శుద్ధి అగ్ని ప్రతిస్థాపన, త్రేతాగ్నీ హోమం, అధివాసం నిర్వహించారు. సాయంత్రం పవిత్రమాలలకు శయనధివాసం సర్వదేవత ఆహ్వానం తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు తీ. గోపాలాచార్యులు ఆద్వర్యంలో రుత్విక బృందం ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది. వివిద గ్రామాలకు చెందిన దంపతులు యాగశాలలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు.
*గ్రామదేవతకు బోనాలు
గంపగూడెం మండలంలోని పలు గ్రామాల్లో శ్రావణమాసం సందర్భంగా గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వినగడప, ఊటుకూరుకు చెందిన ప్రజలు తమ గ్రామాల్లోని ముత్యలమ్మను భక్తిశ్రద్దలతో కొలిచారు. అమ్మవారికి చీరలు పసుపు, కుంకుమ గాజులు పూలు పిండి వంటలు సమర్పించారు.
*గోవుల మృతిపై విచారణ నిర్వహించారు
విజయవాడ సమీపంలోకి కొత్తూరు తాడేపల్లి లో గోసంరక్షణ సంఘం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలల్లోని గోవుల మృతి పై భాజపా మండల శాఖ అద్యక్షుడు అన్నవరపు క్రాంతికుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగాగోపాలకృష్ణ, గ్రామశాఖ అద్యక్షుడు కోడుమూరు సూర్యప్రకాష తదితరులు ఆదివారం ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేహరు. దీనిపై న్యాయ విచారణ చేసి, దోషులను గుర్తించి వారిపై కటినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
*పదిహేను మంది జూదరుల అరెస్టు
అందిన సమాచారం ప్రకారం మేరకు స్థానిక నూజివీడు రోడ్డులో శ్రీశ్రీ కళాశాల కూడలిలో కొందరు యువకులు నెంబర్ల జూదం నిర్వహిస్తుండగా దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నట్లు విస్సన్నపేట ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. వారి నుండి రూ. 2,040 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వారిని సొంత పూచికత్తుపై వదిలామని సోమవారం తిరువూరు కోర్టుకు తరలించనున్నామని వెల్లడించారు. గంపలగూడెం మండలం వినగడప శివారు నరికంపడులో ఆదివారం సాయంత్రం జూదమాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
*ఇద్దరు గుట్కా విక్రేతల అరెస్టు
విస్సన్నపేటలో నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్నా ఇద్దర్ని ఆదివారం విస్సన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం విస్సన్నపేట ఎస్టీ కాలనీలోని ఓ గృహంలో అనుమోలు పాండురంగారావు స్థానిక ఎస్సీ వాడలో మేకల పద్దయ్య దుకాణంలో గుట్కాలు విక్రయిస్తుండగా స్వాదీనం చేసుకున్నామనారు.
*నాణ్యమైన సదుపాయాలు, ఉత్తమ బోధనే లక్ష్యం
నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఆహారం ఉత్తమ బోధనా తమ పాటశాల లక్ష్యమని కొండపర్వలోని గిరిజన సం క్షెమ శాఖ గురుకుల పాటశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత తెలిపారు. పాటశాల ప్రాంగణంలో ఆదివారం ఆమె విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. నెలకోసారి తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకొని పిల్లలకు ఎదురయ్యే సమస్యలు తెలుసుకుని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
*చేతివృత్తి కార్మికులుగా గుర్తిచాలీ
టీవీ టేక్నిశియన్లు చేతి వ్రుత్తి కార్మికులుగా గుర్తిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరచేందుకు ఆర్ధిక తోడ్పాటు అందించాలని టీవీ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ అద్యక్షుడు ఎస్.శేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్దిఅకంగా ఇబ్బందులు పడుతున్నందున ఆడుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేకంగా బ్యాంకుల నుంచి రుణాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
*15 నుంచి కృష్ణజయంతి, రాధాస్తామి ఉత్సవాలు
తిరువూరు శ్యామవేదీ మందిరంలో ఈ నెల 15నుంచి సెప్టెంబరు 6 వరకు కృష్ణ జయంతి రాధాస్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు మందిర కమిటీ నిర్వాహకులు తెలిఅప్రు. ఈనెల 15 వరకు జరిగే రాధాకృష్ణుల ఊయల ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా ప్రారంభించినట్లు వివరిమ్కాహ్రు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవం సాయంత్రం 6నుంచి 7 గంటల వరకు జరుగుతుందన్నారు. 15న బలరామ ఆవిర్భావ పూర్ణిమ, 23న శ్రీకృష్ణ జయంతి వేడుకలు, 24న మహాప్రసాద వితరణ, సెప్టెంబరు 6న రాధాస్టమి వేడుకలు జరుగుతాయని చెప్పారు.
*భాజపాకు ప్రజల్లో ఆదరణ
ప్రధాని మోడీ నాయకత్వంలో భాజపా ప్రబుత్వాన్ని ప్రజల్లో ఆదరణ పెరుగుతతుందని ఆపార్టీ జిల్లా నాయకుడు దారా మాధవరావు తెలిపారు. పట్టణ పరిధిలోని శాంతినగర్, సుగాలీ కాలనీలో ఆదివారం భాజపా సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయమ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భాజపా నుంచి బలమైన అభ్యర్ధులను బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
*పేదలకు వస్త్రాలు దుప్పట్లు పంపిణి
బక్రీద్ సందర్భంగా స్థానిక కార్యాలయంలో జామా అతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు ఆదివారం పేదలకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జామా అతే ఇస్లామీ హింద్ అద్యక్షుడు ఎ.హమీద్ మాట్లడారు. కార్యక్రమంలో ప్రతినిధులు వలీ అహ్మద్ అజీజ్ ముజీబ్ యాకూబ్ రెహమాన్ ఉద్దండు, కరీముల్లా మహాబుసా, ఇస్మాయిల్ పాల్గొన్నారు.
*ప్రజా సంఘాల ఆద్వర్యంలో 14న అవగాహనా సదస్సు
ఎ.కొండూరు మండలంలోని కంభంపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈనెల 14న ప్రజా సంఘాల ఆద్వర్యంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకుడు వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో అభ్యదులకు పలు అంశాల్లో అవగాహనా సందేశాలను నివృత్తి చేయడంతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన అద్యయన సమగ్రీని ఉచితంగా అందజేష్టామని చెప్పారు.
*తిరువూరు భవిత కార్యాలయంలోఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫిజియోదేరపి ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తారు.
*ఇద్దరికి పాముకాటు
తిరువూరు మండలం చౌతపల్లికి చెందిన చటారి మహాలక్ష్మి తమ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఆదివారం పాముకాటు ఎసింది. గాయపడిన ఆమెను చికిత్స నిమితం కుటుంబ సభ్యులు తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అదే విధంగా కోకిలంపాడుకు చెందిన షేక్ హసన్ ఆదివారం సాయంత్రం పాముకాటుకు గురయ్యాడు.
*కుక్కలా దాడిలో బాలుడికి గాయాలు
కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సతిరువురులోని రాజుపెతలో ఆదివారం జరిగింది. కాలనీకి చెందిన సంపత్ స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా విదీలో కుక్కలు దడి చేసాయి. గాయపడిన సంపత్ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రాంతీయ వైద్య శాలకు తరలించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.