24-03-2019 (ఆదివారం) మధ్యాహ్నం 03.00 గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా అధ్యక్షుడు జగన్ తిరువూరులో పర్యటించనున్నారు. తిరువూరు బోస్ బొమ్మ సెంటర్లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో తిరువూరు వైకాపా అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్లు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.