తిరువూరు తిరునాళ్ళుగా పిలవబడే స్థానిక శ్రీవేంకటాచల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది మాఘ మాసంలో పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. వచ్చె 19వ తేదీన కల్యాణోత్సవం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు నిర్వాహకులు చేశారు. నాలుగు వందల సంవత్సరాల క్రితం తిరువూరు జమీందారు నిర్మించిన శ్రీవేంకటాచల దేవాలయంలో ప్రతి ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. 20వ తేదీన స్వామివారి గరుడోత్సవం,21వ తేదీన రధోత్సవం, 22వ తేదీన ద్వాజావరోహనం, 23వ తేదీన స్వామివారి పవళింపు సేవతో ఈ తిరునాళ్ళు ముగుస్తాయి. తదితర ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.