కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఐటి,మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన.పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తో కలిసి ప్రారంభించారు.
*ప్రతి పేదవాడికి 5రూ లకే పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో నిర్మించిన”అన్న క్యాంటీన్ ప్రారంభించారు.అనంతరం ఎంపీ,ఎమ్మెల్సీ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అల్పాహారం చేశారు.తిరువూరు మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో నిర్మించిన చెత్తతో-సంపద కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు.
*గతంలో పింఛన్ 200 నేడు 5రేట్లు పెంచి 1000 అందజేస్తున్నాం..
*రాష్టంలో 150 కు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం.
*రాష్టానికి కీయా మోటార్ అనేక కంపెనీలను రాష్టానికి తీసుకురావడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం..
*రాష్టానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేసారని ఆరోపించారు.
*రాష్ట్ర రాజధాని కొరకు 1500 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
*పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం మన ఎంపీలు పోరాడుతుంటే సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు.
*ఎంపీ లపై కూడా లాఠీ ఛార్జ్ చేస్తున్నారంటే కేంద్రం ఎంత కుట్రపూర్వకంగా వ్యవహరిస్తోంది.
*బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్టాలపై ఈడి దాడులు చేస్తున్నారని అన్నారు.
*ప్రధాని మోడీ తన గురించి కూడా మాట్లాడారని తాను రాష్టానికి కంపెనీలను తీసుకురావడం ఎల్ఈడి లైట్లు,సీసీ రోడ్లు తేవడం తప్పా అని ప్రశ్నించారు.
*జగన్మోహన్రెడ్డి పై జరిగిన కోడికత్తి కేసును NIA కు అప్పగించడం మాకేం అభ్యంతరం లేదని అన్నారు.
*వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని కానీ జీతం సమయానికి తీసుకుంటారని విమర్శించారు.
*రాష్టంలోని 25 ఎంపీ స్థానాలను గెలిపించాలని ప్రజలను కోరారు.
*మండలం లోని సూరవరం, ముష్టికుంట్ల రహదారి అభివ్రుద్దికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ దంపతులు, కలెక్టర్ లక్ష్మికాంతం తో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్థానిక తెలుగుదేశం నాయకులూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.