ఉదయం కళకళ. సాయంత్రం వెలవెల. దేవాలయాల్లో పరిస్థితి ఇది.
తిరువూరు పరిసర ప్రాంతాల్లో గురుపౌర్ణమి సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యెక పూజలు జరిగాయి.తిరువూరులో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఉన్న సాయి ఆలయాల్లోనూ అభిషేకాలు నిర్వహించి, అన్నదానాలు చేశారు. పలువురు గురువులకు ప్రస్తుత విద్యార్ధులు, పూర్వ విద్యార్ధులు గురుపూజోత్సవం నిర్వహించారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరువూరుతో పాటు అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాలను మూసివేశారు. నెమలి శ్రీకృష్ణ దేవాలయాన్ని మద్యాహ్నం మూడు గంటల నుండి మూసివేశారు. శనివారం మధ్యాహ్నం నుండి ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం పూర్తీ అయిన అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు కల్పిస్తారు.