శేషవాహనం పై ఊరేగిన నెమలి వేణుగోపాలుడు–గురువారం నాడు కల్యాణోత్సవం
ఆంధ్రా రాష్టంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షెత్రం నెమలి వేణుగోపాల స్వామీ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మంగళవారం నాడు వేణుగోపాల స్వామిని పెండ్లి కుమారుడిని చేసి అంకురార్పణ చేసారు. రెండో రోజు శేషవాహనం పై బుధవారం రాత్రి నెమలి పుర వీదుల్లో శ్రీ రుక్మిణి సత్యభామ సామెత వేణుగోపాల స్వామిని ఊరేగింపు జరిపారు.
**నేడే కల్యాణోత్సవం
ఈ ఉత్సవాల్లో ప్రధామైనడిగా భావించే వేణుగోపాల స్వామీ కల్యాణోత్సవం గురువారం రాత్రం పది గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. కృష్ణా, ఖమం జిల్లాలతో పాటు ఉభయ రాష్ట్రాల నుండి దాదాపు లక్ష మంది భక్తులు ఈ కళ్యాణోత్సవానికి హాజరవుతారని ఏర్పాట్లు చేస్తున్నారు.