తిరువూరు పరిసర ప్రాంతాల్లో శివరాత్రి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి స్థానిక ప్రజలు సన్నద్దమవుతున్నారు. పలు శివాలయాలు, ఇతర ఆలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. శివపార్వతుల కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. కొత్త బస్టాండ్ సెంటర్ లో ఉన్న రామలింగేశ్వరస్వామీ దేవాలయంలో, పాత బస్సు స్టాండ్ సెంటర్ లో ఉన్న చంద్రమౌళీశ్వర స్వామీ దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యెక పూజల కోసం ఏర్పాట్లు చేసారు. సమీపంలో ఉన్న ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి గుడిలో శివరాత్రి ఉత్సవాలను, శివ కల్యాణాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి. మంగళవారం నాడు తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి నీలాద్రి గుడికి ప్రతి అరగంటకు ఒక బస్సు నడపడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేసారు. మధిర సమీపంలో ఉన్న కూడలి, కోటప్పకొండ, శ్రీశైలం తదితర ప్రాంతాలు వెళ్ళడానికి భక్తులు సిద్దమవుతున్నారు. వివిధ గ్రామంలోని శివాలయాల్లో ప్రత్యెక పూజలు నిర్వహిస్తున్నారు. పలు దేవాలయాల్లో అన్నదానానికి ఏర్పాట్లు చేసారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.