కృష్ణాజిల్లా తిరువూరు నియోజక వర్గంలోని విసన్నపేట లో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల చేరుకున్న సందర్భంగా విసన్నపేటలొ వైఎస్సార్ పార్టీ నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. సిద్ధార్ధ స్కూల్ దగ్గర నుండి ప్రారంభమైన పాదయాత్రకు అభిమానులు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఈ పాదయాత్ర సెంట్ తెరెసా స్కూల్ వరకూ కొనసాగించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లోకేష్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర ప్రజా సమస్యలను తెలుసుకొని tdp చేస్తున్నా అరాచకాలను అరికట్టుటకు మరి ఎంతో సమయం లేదని రాబోయే ఎలక్షన్లలో వైయస్సార్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి భూక్య రాణి వైస్ ఎంపీపీ దుర్గారావు కుటుంబరావు ప్రకాష్ ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.