గత 400సంవత్సరాల నుండి మాఘమాసంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తిరువూరు శ్రీ వేంకటాచల స్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరువూరు తిరునాళ్ళుగా ఈ ఉత్సవాలు పూర్వం జమిందార్ల హయాం నుండి జరుగుతున్నాయి. పాత తిరువూరులో శ్రీ వేంకటాచల స్వామీ దేవాలయాన్ని 416 ఏళ్ల క్రితం అప్పటి జమిందార్లు నిర్మించారు. దీనికోసం తిరువూరు రోలుపడి గ్రామాల్లో దాదాపు 50ఎకరాల భూమిని ఉత్సవాల కోసం ధూపదీప నైవేద్యాల కోసం జమిందార్లు కేటాయించారు. సోమవారం నుండి ఈ ఉత్సవాలు వైభవంగా జరిగేటట్లుగా ఏర్పాట్లు చేశారు. 30వ తేదీ మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. ఫిబ్రవరి 1వ తేదీన రధోత్సవం, 2వ తేదీన చూర్ణోత్సవం, 3వ తేదీన స్వామివార్ల పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మరి కొన్ని వివరాలు దిగువన పరిశీలించవచ్చు.