*పదవీ కాలం పొడిగించినందుకు ధన్యవాదాలు
తన పదవీకాలం ఆరు నెలలు గడువు పోడిగించినందుకు తెదేపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు కు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహాకార సంఘాలన్నీ తీర్మానం చేసి పంపినట్లు మార్క్ ఫెడ్ చైర్మన్ కంచి రామారావు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం తిరువూరు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధరకు ప్రతి గింజ కొనుగోలు చేసి, మెరుగైన సేవలు అందించటానికి కృతజ్ఞతతో ఉన్నట్లు చెప్పారు.