తిరువూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 22వ వర్థంతిని నిర్వహించారు. పలుచోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, తెదేపా జెండాను ఎగురవేశారు. రోగులకు పండ్లు దానమిచ్చారు. రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, స్థానిక తెదేపా నాయకులు తాళ్లూరి రామారావు, సుంకర కృష్ణమోహన్, గద్దె వెంకన్న, కిలారు బిందు, యండ్రాతి కిరణ్, యండ్రాతి మాధవి, కొత్తపల్లి ఆనందస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.