సందడిగా సెయింట్ ఆన్స్లో పూర్వ విద్యార్థుల సమావేశం-చిత్రాలు
తిరువూరు సెయింట్ ఆన్స్ పాఠశాలలో 2004 ఆ తర్వాత బ్యాచ్ల విద్యార్థుల సమావేశం శనివారం నాడు పాఠశాల ఆధ్వర్యంలో సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో 200మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కసుకుర్తి నళిని తదితర ఉపాధ్యాయులను ఈ సందర్భంగా విద్యార్థులు సన్మానించారు. వేల్పుల భరత్ సమన్వయంలో సాగిన ఈ కార్యక్రమంలో పాథశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ కుసుమ, మాజీ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జోస్లిన్, ఉపాధ్యాయులు జైన్, అల్తాఫ్ హుస్సెన్, విద్యార్థులు కోట సంకీర్తి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.