తిరువూరు పట్టణ సీపీఐ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భవించి 92 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. తిరువూరులోని పలు చోట్ల సీపీఐ జెండాలు ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండా వందనం నిర్వహించారు. తమ పార్టీ అధికారం కోసం కాకుండా బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతుందని వక్తలు పేర్కొన్నారు.