మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తిరువూరులో ఉన్న రెండు శివాలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారఒ రాత్రి చంద్రమౌళిశ్వర స్వామి దేవాలయంలోనూ, రామలింగేశ్వర స్వామి దేవాలయంలోనూ శివపార్వతుల కళ్యాణాలు వైభవంగా నిర్వహించారు. సమీపంలో ఉన్న నీలాద్రి గుళ్ళు, గుట్టపాడు అప్పయ్య స్వామి తిరునాళ్ళకు తిరువూరు నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్ళారు. ఈ పుణ్యక్షేత్రాలకు ఆర్టిసీ ప్రత్యేక బస్సులను నడిపింది.