కొద్ది నెలల క్రితమే తెదేపాలో చేరిన విజయవాడ ప్రముఖ నేత, మాజీమంత్రి దేవినేని నెహ్రూను క్రియాశీలంగా వ్యవహరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో తెలుగుదశం పార్టీ కోల్పోయిన తిరువూరు, నూజివీడు, గుడివాడ, నియోజకవర్గ బాధ్యతలను దేవినేని నెహ్రూకు ముఖ్యమంత్రి అప్పగించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టవంతం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను గెలిపించే బాధ్యతలను నెహ్రూకు అప్పగించారు. రాష్ట్ర పార్టీలో కూడా నెహ్రూకు కీలక పదవిని కట్టపెడతారని, ఆయనకు ఉన్న అనుభవాన్ని, సీనియార్టీనీ పార్టీకి ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.