• వచ్చే 10వ తేదిన విడుదలవుతున్న “ఓం నమో వేంకటేశాయ” సినిమా విజయవంతం కావాలని ఆ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆకాక్షించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో కలిసి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి లో హల ఇందూరు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
• బ్యాంకు లలో నగదు తీసుకోవటం పై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఆర్.బీ.ఐ.మార్చి 13 నుండి ఎత్తివేస్తున్నల్టు ప్రకటించింది.
• ప్రమాణ స్వికారం చేయకుండా పరాభవం పాలైన శశికళ తన పార్టికి చెందిన శాసన సభ్యులను అజ్ఞాత ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం.
• కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో తెలంగాణా టిడిపి నేతలు భేటి అయ్యారు. ఇవాళ్ళ న్యూ డిల్లీలో టిడిపి నేతలు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. కేంద్రం మంజూరు చేసే ఇళ్ళను తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్య తీసుకుంటానని వెంకయ్య హామీ ఇచ్చారు.
• ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ను గురువారం వైఎస్సార్సిపి నేతలు కలిశారు. భన్వర్ లాల్ కార్యాలయానికి వెళ్ళిన వైఎస్సార్సిపి ఎమ్మెల్యే ఆర్కే, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు.
• కేవలం రూ.30 వేల కోసం తండ్రిని ఓ తనయుడు హతమార్చాడు. ఈ సంఘటన లింగంపేట మండలం శెట్ పల్లిలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మూడo పోచయ్య, మూడం ఆశయ్య తండ్రి కొడుకులు రుణమాఫీ డబ్బులు వాడుకుంటూ తనకు అన్యాయం చేశాడని ఆశయ్య తమ పొలంలోనే తండ్రి పోచయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనoతరం కోపంతో తండ్రి నెత్తిపై కర్రతో బలంగా కొట్టాడు.
• గవర్నర్ విద్యాసాగరరావు ను కలవడానికి ముంబాయి బయలు దేరిన పన్నీర్ సెల్వం.
• జయలలిత మృతి పై తనకు కూడా అనుమానాలు వున్నాయని, దీనిపై ఒక విచారణ కమిషన్ వేస్తామని పన్నీర్ సెల్వం ప్రకటించారు.
• అమరావతి పరిసరాల్లో ఉన్న గ్రామాలను 13 జోన్ లుగా ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.
• శశికళ కు మద్దతిస్తున్న ఎమ్మెల్యే లు డిల్లి లో రాష్ట్రపతి ని కలవడానికి బయలు దేరుతున్నట్లు సమాచారం.
• విజయవాడ లో మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నాని స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ప్రకటించారు.
• టీం ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తో తనకు ఏవిధమైన సంబంధం లేదని నటి సాగరిక ప్రకటించింది.
• ప్రముఖ టెన్నిస్ క్రిడాకారిణి సానియా మిర్జా కు హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు సేవా పన్ను చెల్లించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని నోటిసులు జారిచేశారు.
• ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. మోడీ ప్రధానమంత్రి కాదని, గబ్బర్ సింగ్ లాంటి వాడని ఆమె ఆరోపించారు.
• అన్నాడిఎంకే ఐటి కార్యదర్శి రామచంద్రన్ ను ఆ పదవి నుండి శశికళ తప్పించింది.
• ఉత్తరప్రదెశ్ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టి బుధవారం నాడు తన ఎన్నికల మానిఫెస్టో ను విడుదల చేసింది.
• భారత స్పిన్ దిగ్గజం రవి చంద్రన్ అశ్విన్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకునేందుకు చేరువలో ఉన్నారు. భారత్ – బంగ్లా మధ్య జరిగే మ్యాచ్ లో రెండు వికెట్లు తీస్తే అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టిస్తాడు.
• విజయవాడలో జెండా దిమ్మల ఏర్పాటులో ఏర్పడిన వివాదం తెలుగుదేశం, వైకాపా ల మధ్య రణరంగాన్ని సృష్టించింది. దీంతో పోలీసులు ఇరు పార్టీల నాయకులను అరెస్ట్ చేశారు.
• ఏప్రిల్ లో నిర్వహిస్తున్న ఉస్మానియా యునివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావలసినదిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించారు.
• రాజ్యసభలో ప్రధాని మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో కాంగ్రెస్ వాకౌట్ చేసింది.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.